Sunday, April 18, 2010 0 comments

అరుదైన అవకాశం.....

వారాణసిలో ఉంటున్న కృష్ణమోహన్ కు పురాతన కాలంనాటి పుస్తకం ఒకటి దొరికింది. అతడా పుస్తకాన్ని అటు ఇటు తిరగేసి ఒక పేజి దగ్గర ఆగి చదివాడు .గంగానది ఒడ్డున ఓ ప్రాంతంలో మహిమలున్న రాళ్లు ఉంటాయని ,స్పర్శకు వెచ్చగా ఉండే ఆ రాళ్ళతో ఎ వస్తువుని తాకినా అది బంగారంగా మారిపోతుందని అక్కడ రాసుంది . వెంటనే పుస్తకంలో రాసున్న ప్రదేశానికి వెళ్లి రాళ్లకోసం వెతకడం ప్రారంబించాడు కృష్ణమోహన్ . ఒక్క రాయి దొరికిన తన జీవితం మారిపోతుందనే ఆశ అతడిది.
నది ఒడ్డున వారం రోజులు వెతికినా విలువైన రాయిని గుర్తించలేకపోయాడు కృష్ణమోహన్ . అయిన అతడు వెతుకుతూనే ఉన్నాడు . రెండు వారాలు గడిచాయి . రాయి జాడ కనిపేట్టలేకపోయాడు. తన బతుకును మార్చేస్తున్ధనుకున్నరాయి దొరక్కపోవడంతో కృష్ణమోహన్ ఎంతో నిరాశాచెందాడు .ఒక్కోరాయిని తాకి చూసి అది వెచ్చగా లేకుంటే కోపంతో నదిలోకి విసిరేస్తుండేవాడు . చివరికి అతడికది అలవాటుగా మారింది .
వెచ్చగా వెతగ్గా ఓ రోజు మహిమలున్న వెచ్చనిరాయి అతడి చేతికి దొరికింది .ఆ వెచ్చదనాన్ని గుర్తించేలోపే అలవాటు ప్రకారం రాయిని విసిరేశాడు రాయి చేతినుంచి జారిపోయే ఆకరు క్షనములొగాని అతడా విషయాన్నీ గమనించలేదు.
అప్పటికే జరగాల్సిన అనర్ధం జరిగిపోయింది .కృష్ణమోహన్ శ్రమంతా వృధా అయిపోయింది .

నీతి : మనకు అవకాశాలు అరదుగా వస్తుంటాయి . వాటిని ఎంతో
జాగ్రత్తగా గుర్తించి సద్వినియోగం చేసుకోవాలె తప్ప మాత్రం అలక్ష్యము గా వ్యవహరించిన చేజరిపోతాయి...

No Response to "అరుదైన అవకాశం....."

Post a Comment